ఈ దేశంలో మహిళలకు చదువు అవసరం లేదని చెప్పిన కాలంలోనే ఆ అన్యాయాన్ని సవాలు చేసి విద్యా దీపం వెలిగించిన మహానేత్రి సావిత్రిబాయి ఫూలే. కుల వివక్ష, లింగ వివక్షలతో నిండిన సమాజంలో అణగారిన వర్గాల పిల్లలకు, మహిళలకు విద్య హక్కు కావాలని పోరాడిన గొప్ప సామాజిక యోధురాలు. ఆమె వేసిన అడుగులు ఈ దేశంలో సమానత్వం కోసం జరిగిన ప్రతి ఉద్యమానికి పునాది అయ్యాయి.
ఈరోజు కూడా సమాజంలో అసమానతలు, అన్యాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. సావిత్రిబాయి ఫూలే చూపిన దారిలోనే అణగారిన వర్గాలకు న్యాయం జరిగే వరకు, విద్య ప్రతి ఒక్కరికీ అందే వరకు మన పోరాటం ఆగదు.
మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి మార్గదర్శకురాలైన సావిత్రిబాయి ఫూలే గారి వర్ధంతి సందర్భంగా ఆమెకు *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* తరుపున ఘన నివాళులు.”
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>