*బంజారా జాతి ఆరాధ్య దైవం, మహనీయుడు సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఘనంగా నివాళులర్పించారు.*🙏💐
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శతాబ్దాలు గడిచినా సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారిని బంజారా జాతి మరవకపోవడం ఆయన చూపిన ధర్మ మార్గం, సేవా తత్వం ఎంత గొప్పదో తెలియజేస్తుందని అన్నారు.*
*సమానత్వం, నైతిక విలువలు, సామాజిక ఐక్యత కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.*
*రాబోయే బీసీ రాజ్యంలో సేవాలాల్ మహారాజ్ గారి ప్రాముఖ్యతకు ప్రత్యేక గౌరవ హోదా కల్పిస్తామని, ఆయన ఆశయాలను ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబింపజేస్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు స్పష్టం చేశారు.*
*అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వేరు కాదని మనందరం ఒకటేనని, తెలంగాణలో మున్నూరుకాపు (మేము ) బీసీలు అయితే మహారాష్ట్రలో మేము ఎస్టీలుగా ఉన్నామని, ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలంతా సామాజికంగా ఒకటే అని,మనం బలమైన శక్తిగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.*
*ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, బంజారా సోదరులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు*🙏💐💐💐
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>